ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 04:10 PM

ఈనెల 13వ తేదీ జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గిరీష సెక్ట్రోరల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సెక్టోరల్ అధికారులతో జిల్లా కలెక్టర్ గిరిష పిఎస్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయ, రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సెక్ట్రోరల్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎటువంటి చిన్న సమస్య తలెత్తకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికలలో రీపోలింగ్ కి అవకాశం లేకుండా జాగ్రత్తగా పోలింగ్ సరళి జరిగేటట్టు చూడాలన్నారు. ఇందుకు సంబంధించి సెక్టోరల్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. సెక్టోరియల్ అధికారులకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు, వీల్ చైర్స్, విద్యుత్, త్రాగునీరు, వెబ్ క్యాసిటింగ్ చేయుటకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు వరకు మార్కింగ్ చేయాలని, పోలింగ్ కేంద్రం లోనికి సెల్ ఫోన్స్ , టీ, కాఫి, వాటర్ బాటల్స్, పెన్ లు, అగ్గి పెట్టలు తీసికెళ్లారాదన్నారు. పిఓ ఇచ్చిన పెన్ తో నే ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa