భవిష్యత్ కోసం సమిష్టిగా పోరాడాలని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అభివృద్ధిలో పోటీపడిన ఏపీ.. నేడు మనుగడ కోసం పోరాడుతోందని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల సమస్యలపై మండలిలో పోరాడేవారికే ఓటేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక్కో టీచర్కు రూ.5 వేలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని, అవినీతి డబ్బుతో టీచర్ల ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లేనని, జగన్రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ పతనమైపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఆర్థిక అసమానతలు తొలిగే వ్యవస్థకు శ్రీకారంచుట్టి.. పేదరికం లేని కుటుంబ స్థాపనే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa