2024 సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు అధికారులకు సహకరించాలని నియోజకవర్గం ఎన్నికల పర్యవేక్షణ అధికారి హరిహరనాథ్ అన్నారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ఎన్నికలపై అవగాహన నియమ నిబంధనలు పై ముఖాముఖి చర్చించిన అవగాహన కల్పించారు. గ్రామాల్లోని తమ తమ పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలొ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించేటట్లు సూచించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులు రాజకీయ పార్టీ నాయకులు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలు తదితర వాటిపై చర్చించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రత్నం, తాసిల్దారు శ్రీకాంత్ కేదార్నాథ్, డిప్యూటీ తాసిల్దార్ ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa