తీవ్ర వనస్థాపానికి గురై రైలు కిందపడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలం కొత్త భీమసింగి గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే యువతి పాత బీమసింగిలో సెల్ పాయింట్ నిర్వహిస్తున్న కొండబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారి మధ్య బంధం బలపడింది. ఇటీవల రెండు నెలల క్రితం వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్ధలు కారణంగా కొండబాబు జగదీశ్వరితో కలసి ఉన్న ఫోటోలను మృతురాలి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు పంపించడంతో జగదీశ్వరి తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం జామి మండలం బీమసింగి గ్రామ సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున వినిపించారు. సమాచారం అందుకున్న రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించి జగదీశ్వరి మృతదేహాన్ని విజయనగరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa