తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర 38వ రోజుకు 500 కిలోమీటర్లు మైలురాయిని దాటిన సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం టిడిపి విశాఖపట్నం పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి అప్పారావు మాట్లాడుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల సమస్యలను అలాగే రైతు సమస్యలను ఎక్కడకక్కడ, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై ముందుకు సాగడం సంతోష దాయకమని ఆయన అన్నారు. యువ గళం పేరుతో తలపెట్టిన పాదయాత్ర ఇంకా 362 రోజులు పాటు 3500 కిలోమీటర్లు సాగుతుందని ఆయన తెలిపారు. లోకేష్ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని ఆయన కోరారు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనకు అధికార పార్టీ ఓర్వలేకపోతోందని ఆయన విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa