రాజంపేట డివిజన్ కేంద్రంలోని రాజంపేట, నందలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేల్ మండలాల్లో సోమవారం జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. రాజంపేట మినహా అన్ని మండలాలలో నిర్ణయత సమయానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజంపేట పట్టణంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పట్టబద్రల ఓటర్లకు సంబంధించి సాయంత్రం నాలుగు గంటలు దాటినప్పటికీ భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 420 ఉపాధ్యాయుల ఓటర్లు ఉండగా 388 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3665 మంది పట్టపద్రులు ఉండగా 2503 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పట్టపద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ పక్రియకు సరలిని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల్ రాయుడు, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, రాజంపేట సబ్ కలెక్టర్ పర్వాన్ అహ్మద్ ఖాన్, డి. ఎస్. పి శివ భాస్కర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డి. ఎస్. పి శివ భాస్కర్ రెడ్డి భారీ బందోబస్తు నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కేంద్రాలలో అన్ని వసతులను ఏర్పాటు చేశారు. రెండు పోలింగ్ కేంద్రాలలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఓటర్లను మాత్రమే లోపలికి అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బందోబస్తు విధుల్లో సిఐ నరసింహారావు, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై భక్తవత్సలం, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa