ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ సభకు భారీగా తరలిన నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 04:02 PM

మచిలీపట్నం మండల పరిధిలోని సుల్తానగర్ నందు నిర్వహించ తలపెట్టిన జనసేన పదో ఆవిర్భావ సభ సందర్భంగా మచిలీపట్నంకు నియోజక వర్గంలోని నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, కోడూరు మండలాలలో జనసేనుకులు భారీ సంఖ్యలో బైక్ లు, ప్రత్యేక వాహనాలతో వెళ్లారు. సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో తరలివెళ్లారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన పోలీసులు ఎన్ని ఆంక్షలుపెట్టినా బెదిరేది లేదు అంటూ రోడ్లపై జనసైనికులు వచ్చి తమ ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధమని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో ని, జనసేనపార్టీ అధ్యక్షులు వారంరోజులు గా సభను విజయవంతం చేయాలని విస్తృతంగా పర్యటన చేశారు.నియోజకవర్గంపరిధిలోని సుమారు 1000 బైకులు, 500 వాహనాలతో భారీగా తరలి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa