ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదలైన జనసేన పార్టీ ఆవిర్భావ సందడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 07:59 PM

జనసేన పార్టీ ఆవిర్భావ సందడి మొదలైంది. జనసేన 10వ ఆవిర్భావ సభతో కృష్ణా జిల్లా మచిలీపట్నం సందడిగా మారింది. జనసేన నేతలు, కార్యకర్తలు మచిలీపట్నంకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం ‘వారాహి’పై బందర్ రోడ్డు మీదుగా ర్యాలీగా బయల్దేరారు. ఆయనకు అభివాదం చేసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో బందరు రోడ్డు కిక్కిరిసిపోయింది. కొంత మంది అభిమానులు రోడ్డు వెంట ఉన్న పోల్స్ పైకెక్కి, వారాహిపై ఉన్న పవన్ కళ్యాణ్‌కు కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఇదిలా ఉండగా.. జనసేన ‘దిగ్విజయభేరి’ సభ నేపథ్యంలో ఓ రైల్వే అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


‘మన పట్టణం (మచిలీపట్నం)లో జనసేన ఆవిర్భావ సభ జరుగుతోంది. పట్టణంలో జేబుదొంగలు, చైన్ స్నాచర్స్ సంచరించవచ్చు. సైకిల్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తమ పర్సులు, ఆభరణాలు కాపాడుకోవాలి. అజాగ్రత్తగా ఉండకుండా, జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించడమైనది’ అని ఆ వీడియో క్లిప్పింగ్ సందేశం.


మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తున్నట్లుగా ఈ వీడియోను ప్రచారం చేస్తున్నారు. ప్రజా హితార్థం ఈ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్ర రెడ్డి ట్విటర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ.. జనసేనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విమర్శలు - ప్రతివిమర్శలతో సోషల్ మీడియాలో ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ వీడియో మార్ఫింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలను చిత్రీకరించి, వాయిస్ ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి ఉండవచ్చు!!







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa