ముందస్తు ఎన్నికలు వస్తే నష్టపోయేది జనసేన పార్టీయేనని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. 'ఎన్నికలకు ఒక సంవత్సరం సమయం ఉంది. జగన్ గారు ముందస్తు ఎన్నికలకు పోతే ఇంకా ముందే ఎన్నికలు రావచ్చు. ముందస్తు ఎన్నికలకే ముఖ్యమంత్రి గారు మొగ్గు చూపుతారని నా అభిప్రాయం. ఇప్పటికైనా స్పష్టతతో విధి విధానాలు రూపొందించుకొని ముందుకు పోకపోతే నష్టపోయేది జనసేన పార్టీ మాత్రమే' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటి నుంచే స్పష్టమైన విధి విధానాలు ఉండాలనేది ఐవైఆర్ చెబుతున్న మాట.
ఐవైఆర్ చేసిన ట్వీట్పై కొందరు స్పందించారు. స్పష్టత ఇవ్వాల్సింది బీజేపీ నేతలు.. అంతే కానీ జనసేన కాదు అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు. ఇక విధి విధానాలు ఏమి లేవు (మళ్ళీ జగన్ గారు సీఎం కాకుండా ) విధి (కులం)ని (విధాత బాబు )గార్ని కలుపుకొని ముందుకు పోవడమనే స్పష్టత వచ్చింది కదా నిన్నటి సభలో అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు జనాదరణ కలిగిన నేతలు ఉన్నప్పుడే బీజేపీ ఎదగకపోతే.. ఇక ఎప్పటికీ ఎదగదని మరొకరు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa