పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర.. అన్నమయ్య జిల్లాలో 43వ రోజు కొనసాగుతోంది. గుట్ట పాలెం విడిది కేంద్రం నుంచి.. లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే.. లోకేష్ పాదయాత్ర సందర్భంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బి.కొత్తకోట పట్టణంలో యువగలం పాదయాత్ర సందర్భంగా.. పట్టణ మెయిన్ రోడ్డులోని దుకాణాలను పోలీసులు మూసేయిస్తున్నారు. ఎందుకు మూసేయిస్తున్నారో చెప్పడం లేదని దుకాణాదారులు వాపోతున్నారు.
ఇటు పాదయాత్రలో భాగంగా.. లోకేష్ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. రానున్నది.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, అందరి సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పరిశ్రమలు లేనందున ఉపాధి లభించడంలేదని వ్యాఖ్యానించారు. పాలకు గిట్టుబాటు ధర ఉండడంలేదన్నారు. మట్టి మాఫియాతో ఇబ్బందులు పడుతున్నామని.. టమాట మార్కెట్లో దళారుల రాజ్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని.. జాక్పాట్ భారం నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు లోకేష్కు విన్నవించారు.
ఎస్సీ, ఎస్టీ కేసుల తరహాలో.. బీసీలకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి రక్షణ కల్పిస్తామని.. నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వేధింపులకు గురైన బీసీ బాధితులకు ప్రభుత్వం ద్వారా న్యాయ సహాయం అందిస్తామన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని.. మదనపల్లెకు బీసీ స్టడీ సర్కిల్ తీసుకొస్తామని.. విదేశీ విద్యను పునరుద్ధరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామని టీడీపీ యువనేత స్పష్టం చేశారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa