రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది. ప్రముఖ ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. 2023 ఏడాదికి గానూ శక్తికాంత దాస్కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ప్రకటించినట్లు తెలిపింది. కరోనా తర్వాత ఎదురైన క్లిష్ట సమయంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా అందించిన సేవలకు గానూ ఈ అవార్డు ప్రకటించినట్లు వెల్లడించింది. నాన్ బ్యాంక్ సంస్థ కుప్పకూలడం, కోవిడ్ మహమ్మారి తొలి, రెండో వేవ్, ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో పెరిగిన ద్రవ్యోల్బణం వంటి క్లిష్ట సమయంలో ఎంతో గొప్ప పని తీరును కనబరిచారాని శక్తికాంత దాస్ను కొనియాడింది సెంట్రల్ బ్యాంకింగ్.
శక్తికాంత దాస్ నాయకత్వంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన సంస్కరణలు తీసుకురావడం సహా వినూత్న పేమెంట్ వ్యవస్థలను భారత్లో పరిచయం అయ్యాయని సెంట్రల్ బ్యాంకింగ్ పేర్కొంది. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలను ఆకాశానికెత్తింది. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ -2023 పురస్కారాన్ని అందుకున్న రెండో ఆర్బీఐ గవర్నర్గా నిలిచారు శక్తికాంత దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్కు 2015లో ఈ అవార్డు లభించింది.
శక్తికాంత దాస్కు ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఒత్తిడిలో సెంట్రల్ బ్యాంకును ఏ విధంగా నడిపించవచ్చో అనే విషయం చాలా బాగా తెలుసు. కోవిడ్-19 సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్సెట్ క్లాజెస్ తీసుకువచ్చింది. కీలకమైన రంగాలు, ఫారెన్ ఎక్స్ఛేంజీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా అవసరమైన నగదును అందించింది. మరోవైపు.. ఉక్రెయిన్ నేషనల్ బ్యాంక్ కు సైతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది సెంట్రల్ బ్యాంకింగ్. క్లిష్టమైన సమయంలో శక్తికాంత దాస్ నాయకత్వం, భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలో కోసం ఆయన చేసిన కృషికి గానూ ఈ గవర్నర్ ఆఫ్ ది అవార్డు లభించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa