గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏ విధమైన ప్రలోభాలకు ఆశపడకుండా స్వంత ఖర్చులతో లక్షలాది మంది జనసేన 10వ ఆవిర్భావ సభకు వచ్చారని తెలిపారు. మంత్రులు అసెంబ్లీ వదిలేసి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జనసేన సభకు వచ్చిన స్పందన చూసి వైసీపీ నాయకులకు వణుకు మొదలైందన్నారు. నాగార్జున యూనివర్సిటీలోకి గెస్ట్గా ఒక పిచ్చోడు రాంగోపాల్ వర్మను తీసుకు వచ్చారని... ఆ పిచ్చోడు విద్యార్థులకు ఏం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.అధికారపార్టీ వారు విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నారని గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa