-అప్రమత్తంగా వ్యవహరించాలి
-ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుందాం
-ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకు అందరు కృషి చేయాలి
-కో ఆర్డినేషన్ సమావేశానికి హాజరైన మంు్తల్ర శిద్ధా రాఘవరావు, రావెల, ఎమ్మెల్యేలు
సూర్యప్రతినిధి, ఒంగోలు : తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజక వర్గాల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించి జాగ్రత్తగా ఓట్లు వేయించాలని టీడీపీ కో ఆర్డినేషన్ సమావేశం తీర్మానించింది. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కో ఆర్డి నేషన్ సమావేశంలో రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇన్చార్జిలు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి కృషితోనే తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులను గెలిపు సాధ్యమవుతుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శిద్ధా మాట్లాడుతూ పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పట ్టభద్రు ల నియోజకవర్గం అభ్యర్ధిగా వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థిగా వాసుదేవ నాయుడులను గెలిపించుకునేందుకు అందరు కష్ట పడి పని చేయాలన్నారు. పోలింగ్ రోజు ఆయా నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్త బాధ్యత గా ఈ ఎన్నికలను తీసుకొని పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు చేరువయ్యేటట్లు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఎస్సీ,ఎస్టీ విద్యా ర్ధులు ఉన్నత చదువులు చదివేందుకు విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించిందన్నారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి పేద విద్యార్ధులు కూడా విదేశాలలో చదువుకునే విధంగా అవకాశాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి నిధులను కేటాయించడమే కాకుండా వారికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్న ఘనత మన ప్రభుత్వందేనన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి విద్యాభివృద్దికి తోడ్పడడం జరిగింద న్నారు. టిడిపి బలపరచిన అభ్యర్దులను గెలిపించి అధికారంలో ఉన్న ప్రభు త్వం ద్వారా లబ్దిపొందాలని పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సూచించాలన్నా రు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ తూర్పు రాయ లసీమ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందామన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల్లో వున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులను వ్యక్తి గతంగా కలిసి ఓట్లను అభ్యర్థించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ జూపూడి ప్రభాకర్, కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, పోతుల రామారావు, ముత్తుముల అశోక్రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, పాలపర్తి డేవిడ్ రాజు, కందుల నారాయణ రెడ్డి, ఆదెన్న తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa