ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరూ బీజీగా ఉండటంతో....అదును చూసి పెళ్లి మండపంలో దొంగ పనికానించ్చేశాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 05:17 PM

అదును చూసి ఓ పెళ్లిలో దొంగ  తన  చేతివాటంం ప్రదర్శించారు. ఓ వైపు పెళ్లి జరుగుతోందని వారంతా హడావిడిగా ఉన్నారు. ఎవరికి తోచిన పనుల్లో వారు బిజీగా మారిపోయారు. తీరికలేని పనలుతో అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పెళ్లిమండపంలోకి సందట్లో సడేమియాలో దూరాడో వ్యక్తి. అందరూ పడుకున్న సమయంలో తాను అనుకున్న పని సైలెంట్‌గా కానిచ్చేశాడు. ఏకంగా 45 సవర్ల బంగారంతో చెక్కేశాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని మహేశ్ కల్యాణ మండపంలో భారీ చోరీ జరిగింది. తెల్లారితే పెళ్లనగా పెళ్లికూతురి తరుఫు బంధువుల నగలు చోరీకి గురయ్యాయి. ఒకటీ రెండు కాదు ఏకంగా 45 సవర్ల బంగారు నగలను ఎవరో సర్దేశారు. అయితే ఎవరో ఆగంతకుడు నగలను చోరీ చేసినట్లు పెళ్లికూతురి కుటుంబసభ్యులు చెబుతున్నారు. కల్యాణ మండపంలోకి చొరబడి నగలున్న బ్యాగుతో కళ్యాణ మంటపం వెనుకవైపు నుంచి పరారైనట్లు వివరిస్తు్న్నారు.


బాధితులది కేవీబీపురం మండలం కలత్తూరు కాగా.. చోరీ విషయాన్ని బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు అసలు దొంగను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ దొంగతనం బయటి వ్యక్తులు చేశారా లేదా ఇంకెవరైనా హస్తం ఉందా అనే కోణంలో శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa