రానున్న మూడు రోజుల్లో ఏపీలో మరిన్ని భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. వేర్వేరు ప్రమాదాల్లో పిడుగుపాటుకు మొత్తం నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఏపీలోని పిడుగురాళ్ల సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇక, ఉపరితల ఆవర్తనం, అకాల వార్షాల కారణంగా రాష్ట్రంలో పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీల.. పశువుల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa