ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సున్తీ వ్యవహారంతో కోపం.. మొదలైన గొడవలు,,,హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 06:04 PM

కర్నూలులో సంచలనంరేపిన జంట హత్యల కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వర ప్రసాద్‌ తన కుమారుడు శ్రావణ్‌తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.. వారికి కృష్ణవేణి కూడా సహకరించినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ హత్యలకు దారితీసిన కారణాలను వెల్లడించారు.


వరప్రసాద్, కృష్ణవేణి దంపతులు నంద్యాల నుంచి వచ్చి కర్నూలు చింతల మునినగర్‌లో స్థిరపడ్డారు. వీరికి శ్రావణ్‌కుమార్‌ ఏకైక కుమారుడు.. బీటెక్‌ చదివి ఏడాది కాలంగా ఐసీఐసీఐ బ్యాంకు కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అతడికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూశారు.. అప్పుడు వనపర్తిలో స్థిరపడిన వంట మాస్టర్‌ వెంకటేష్, రమాదేవి దంపతుల ఏకైక కుమార్తె రుక్మిణితో పెళ్లి కుదిరింది. కొద్ది రోజుల తర్వాత శ్రావణ్‌కుమార్‌ కాబోయే భార్యకు మొబైల్ గిఫ్ట్‌‌గా ఇచ్చాడు.


అతను ఆ మొబైల్‌లో ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి తన ఈ-మెయిల్‌కి లింక్ చేశాడు. ఈ క్రమంలో రుక్మిణి ఓ యువకుడికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. అప్పటి నుంచి కాబోయే భార్యను అనుమానించాడు.. ఇంతలో మార్చి 1న ఇద్దరికీ వివాహమైంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా వారిద్దరికి శోభనం జరగలేదు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో తన భార్య మొబైల్‌లో యాప్ గురించి, ఫోన్ కాల్స్ గురించి తల్లిదండ్రులకు చెప్పాడు.


రుక్మిణికి పెళ్లి ముందే ప్రేమ వ్యవహారం ఉందని ఆరోపించడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. ఆ తర్వాత శ్రావణ్‌కుమార్‌ను అత్తింటివారు హైదరాబాద్‌కు తీసుకెళ్లగా వైద్యులు సున్తీ చేశారు. అప్పటి నుంచి ఈ గొడవ మరింత ముదిరింది. శ్రావణ్‌కు లైంగిక సామర్థ్యం తగ్గించేందుకు కుట్ర పన్ని సున్తీ చేయించారని తండ్రి వరప్రసాద్‌ భావించాడు. తన కుటుంబం పరువు పోతుందని కోపం పెంచుకున్నాడు.


తన కుమారుడు శ్రావణ్‌తో కలిసి రుక్మిణి కుటుంబాన్ని చంపేయాలని ప్లాన చేశాడు. ఈ నెల 10న స్కెచ్ వేయగా.. ఆ రోజు కుదరలేదు. ఆ తర్వాత శ్రావణ్‌కుమార్‌ వనపర్తి వెళ్లి భార్య, అత్తామామను తీసుకొచ్చాడు. వరప్రసాద్‌ ముందుగానే రెండు కత్తులు కొనుగోలు చేసి ఇంట్లో దాచాడు.. రుక్మిణిని ఇంట్లోనే ఉండగా.. ఆమె తల్లిదండ్రులను ఫస్ట్ ఫ్లోర్‌లోకి పంపి.. శ్రావణ్ తల్లి కృష్ణవేణిని ఇంట బయట కాపలాగా ఉంది.


ముందు రుక్మిణిని వరప్రసాద్, శ్రావణ్‌ నోరు మూసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వరప్రసాద్‌ వెంటనే ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లి రమాదేవిపై కత్తితో దాడి చేశాడు. భర్త వెంకటేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతడ్ని పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడు ఇంట్లో నుంచి బయటపడి తప్పించుకున్నాడు. రమాదేవి మాత్రం అక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు వెంకటేష్‌ను 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్ని గుత్తి పెట్రోలు బంకు దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa