రాయలసీమజిల్లాలలో విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వలు కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వం రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మంత్రి బుగ్గనా రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
ఈ మూడు కాలేజీలను అనంతపురం జిల్లా గుంతకల్, కడప జిల్లా మైదుకూరు, నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెకానికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుంది అంటున్నారు.
మూడ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మంత్రి బుగ్గన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మూడు కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కాలేజీల ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయనంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa