తిరుమల దేవాస్థానం అన్న ప్రసాద వితరణ కోసం టీటీడీకి నారా ఫ్యామిలీ భారీ విరాళం ప్రకటించింది. ఇదిలావుంటే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా భారీ విరాళాన్ని అందజేసింది నారా కుటుంబం. నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల కొండపై ఒకరోజు అన్నప్రసాద వితరణకు రూ.33 లక్షలు విరాళాన్ని లోకేష్, బ్రాహ్మణి దంపతులు అందజేశారు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని కేటాయించారు.
ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో అన్నదాన వితరణకు అయ్యే ఆ మొత్తం వ్యయాన్ని విరాళంగా ఇస్తోంది నారావారి కుటుంబం. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్య ప్రసాద వితరణ కేంద్రం భవనంలో.. టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డిస్ ప్లే బోర్డులో దేవాన్ష్ పేరు కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారి భక్తులు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే టీటీడీ అన్న ప్రసాద వితరణకు ఇలా విరాళాలు ఇస్తుంటారు. కొందరు భక్తులు అన్న ప్రసాదానికి విరాళాన్ని ఇచ్చి తమ మొక్కుల్ని కూడా చెల్లించుకుంటారు. చంద్రబాబు కుటుంబం గతంలో స్వయంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంది. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా అన్న ప్రసాదానికి ఆనవాయితీగా విరాళం అందజేస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa