ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో గోల్డ్ స్కీం పేరుతో ప్రజలకు టోకరా.... లీసులకు బాధితుల ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 11:33 AM

విజయవాడలో సంకల్ప సిద్ధి పేరుతో జనాల్ని ముంచేసిన వ్యవహారం మర్చిపోక ముందే మరోసారి గోల్డ్‌ స్కీం పేరుతో మోసం బయటకు వచ్చింది. గుంటూరులో ఆభరణ జ్యువెలర్స్‌, సురక్ష ట్రేడింగ్‌ కంపెనీ పేరిట తెలుగు రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేశారు. జనాలను స్కీంల ద్వారా చేర్చుకున్నారు.. ఈ క్రమంలో విజయవాడలోని సీతారాంపురంలో ఒక శాఖ ఏర్పాటు చేశారు. నెలకు రూ. 2 వేల చొప్పున 11 నెలలు కడితే 12వ నెల వాయిదా వారు కట్టి.. ఆ మరుసటి నెలలో మొత్తం డబ్బులు, లేని పక్షంలో దాని విలువకు సరిపడా బంగారం ఇస్తామని చెప్పారు.


నిజమని నమ్మి చాలామంది స్కీంలో చేరి వాయిదాల పద్దతిలో డబ్బులు చెల్లించారు. వీరిలో కొందరికి ఈ ఏడాది జనవరితో గడువు ముగిసినా వారికి డబ్బులు తిరిగి చెల్లించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంస్థపై గతంలో స్థానికంగా నమోదైన కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఆ సంస్థ వాయిదాలన్నీ కట్టినా తమకు డబ్బులు చెల్లించడం లేదంటూ కొంత మంది ఆరోపించారు. విజయవాడ సీపీ కాంతిరాణాను కలిసి ఫిర్యాదు చేశారు.


ఈ సంస్థ భాగస్వాముల మధ్య అభిప్రాయ బేధాలున్నాయని.. అందుకే రాద్ధాంతం జరుగుతోందని కూడా అంటున్నారు. విజయవాడలోని నిర్వాహకులను పిలిపించి వారి నుంచి వివరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొంత మందికి డబ్బులు చెల్లించాల్సి ఉందని వాటిని చెల్లిస్తున్నామంటూ నిర్వాహకులు పోలీసులకు చెప్పారట. అధిక వడ్డీ ఆశచూపి రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు కొందరు ఆరోపిస్తున్నారట. గతంలో గుంటూరులో కూడా రెండు నెలల క్రితం ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ మోసంపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa