ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది ఉద్యోగులు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలు,,,తాడేపల్లి సీఎం నివాసంలో ఉగాది వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 11:34 AM

ఈ ఏడాది  ఉద్యోగులు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలుంటాయని తాడేపల్లి సీఎం నివాసంలో ఉగాది వేడుకల్లో పండితులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరిగాయి. ముందుగా శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్‌ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. సీఎం జగన్‌ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం పంచాంగాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించి.. పంచాంగ శ్రవణంలో సీఎం జగన్‌ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని జగన్‌ ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులకు మేలు జరగాలి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.


శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని పంచాంగ పఠనంలో కప్పగంతు సుబ్బరామ సోమయాజి చెప్పారు. ఉద్యోగులు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్‌ సన్మానించారు. తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు..


సీఎం జగన్‌ దంపతులకు మంత్రి ఆర్కే రోజా మెమెంటో అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్‌ దంపతులు వీక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు.. మండలంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa