ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లుడికి తోడుగా మామ నియోజకవర్గం ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 12:30 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపడుతున్న యువగళం పాదయాత్రకు హిందూపురం నుంచి వేలాదిమంది తరలివెళ్లారు. మంగళవారం నియోజకవర్గం నుంచి సుమారు 250 వాహనాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు 2 వేల మందికిపైగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే నివాసం వద్ద ఉదయం 9 గంటలకు టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వ్యక్తిగత వైద్యుడు సురేంద్ర జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. పట్టణంలో వాహనాలు ర్యాలీగా వెళ్లి అనంతరం కదిరి నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్రకు తరలివెళ్లారు. కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ కన్వీనర్లు, మాజీ స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa