ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైల క్షేత్రానికి వెళ్తూ.. మరణించిన భక్తుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 12:30 PM

కర్నూలు జిల్లా, ఆత్మకూరు మండలంలోని నల్లమల అరణ్యంలోని పెచ్చెరువు సమీపంలో కన్నడ పాదయాత్రికుడు ప్రకాష్‌ ముక్చి (45) వడదెబ్బతో మృతి చెందారు. మంగళ వారం ఆత్మకూరు ఎస్‌ఐ హుసేన్‌బాషా తెలిపిన వివరాలివీ.. కర్ణాటక రాష్ట్రం బాగల్‌ కోట్‌ జిల్లా బనహత్తి గ్రామానికి చెందిన ప్రకాష్‌ ముక్చి అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులతో కలిసి గత మూడు రోజుల క్రితం తమ స్వగ్రామం నుంచి శ్రీశైల క్షేత్రానికి కాలినడకన బయలు దేరారు. సోమవారం ఆత్మకూరు మండలం చేరుకుని అక్కడి నుంచి మండుటెండలో కాలినడకన నాగలూటి మీదుగా పెచ్చెరువుకు పయనమయ్యారు. కాగా కుటుంబ సభ్యులు ముందుగానే శ్రీశైలం చేరుకోగా ప్రకాష్‌ ముచ్చి మాత్రం సోమవారం సాయంత్రం పెచ్చెరువుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగానే సొమ్మసిల్లి పడిపోయాడని తోటి పాదయాత్రికులు తెలిపారు. అనంతరం కొద్దిసేపటికే ప్రకాష్‌ ముక్చి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి మంగళవారం తెల్లవారు జామున వెళ్లి మృతుని వివరాలను సేకరించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆత్మ కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. సహజ మరణం కావడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ప్రకాష్‌ ముచ్చి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వారి స్వగృహానికి తరలించలేమని, అంత్యక్రియలు జరిపేందుకు సహకరించాలని ఎస్‌ఐని కోరడంతో ఆత్మకూరు మున్సిపల్‌ అధికారుల సహకారంతో ఆత్మకూరు హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa