రాజధాని అమరావతిని వేగంగా అభివృద్ధి చేస్తామని రాజధాని రైతులకు, ప్రజలకు మాట ఇచ్చి తప్పిన జగన్కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి తీరుతామని రాజధాని రైతులు, మహిళలు హెచ్చరించారు. ‘బిల్డ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఉద్యమం 1190వ రోజులో భాగంగా రాజధాని గ్రామాల రైతులు మహిళలు నిరసన ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజధాని అభివృద్ధి చేస్తానని నమ్మబలికిన జగన్, ముఖ్యమంత్రి కాగానే మాట తప్పారని ఆరోపించారు. రాజధాని విషయంలో మాట తప్పి, మడమ తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన చెప్పిన మాటలను నమ్మి ప్రాణంలాంటి పొలాలను ఇచ్చామన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకలా, ముఖ్యమంత్రి అయ్యాక ఒకలా మాట్లాడడం, మాట తప్పడం, రాజధాని అభివృద్ధి విషయంలో మడమ తిప్పడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. మాట తప్పి, మడమ తిప్పిన ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పి తీరుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa