ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన మాకు నష్టం చేకూర్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 12:35 PM

జనసేనతో తమకు పేరుకే పొత్తు ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోకి కలిసి వెళ్తేనే తమను మిత్రపక్షాలుగా నమ్ముతారని చెప్పారు. ‘మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాత్రమే జనసేన చెప్పింది తప్ప బీజేపీని గెలిపించాలని ఎక్క డా చెప్పలేదు.. జనసేన తమకే మద్దతిస్తోందని పీడీఎఫ్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. అదే ఎన్నికల్లో మాకు నష్టం చేకూర్చింది’ అని అన్నారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం తర్వాత మాధవ్‌ విలేకరులతో మాట్లాడారు. జనసేనతో బీజేపీకి పేరుకు మాత్రమే పొత్తు ఉండడం వల్ల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు నష్టం జరిగిందన్నారు. మూడేళ్లుగా పొత్తులో ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కలిసి ఎక్కడా పని చేయకపోవడంతో ప్రజలు తమ పొత్తును గుర్తించలేదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa