ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం ఇది కొనసాగుతోంది.. ఈ ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదమూ ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మంగళవారం ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.
గత ఐదు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వానలు పడ్డాయి. ఈ అకాల వర్షాలతో అన్నదాతలకు కష్టాలు పడుతున్నారు.. ఈ వానలతో పంటనష్టం తప్పలేదు. ముఖ్యంగా మామిడి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు మరో మూడు రోజులు వర్షాలు పడతాయన్న అంచనాలతో ఆందోళన మొదలైంది. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు పడ్డాయి. వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa