ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే తీరుపై... రాజానగరం టీడీపీ నేతల భగ్గు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 12:45 PM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీడీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తీరుపై కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి.. త్వరగా ఇంచార్జ్ బాధ్యతలు త్వరగా పూర్తి చేయాలని అధిష్టానాన్ని కోరారు. సీతానగరంలో టీడీపీ నేతలు కొందరు సమావేశమై చర్చించారు.. అనంతరం అధినేత చంద్రబాబుకు, పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్‌ ద్వారా తమ వినతిని పంపించారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలు ఏర్పాటు చేసుకున్నామని.. కార్యక్రమానికి ముందుగానే వచ్చి గ్రూపులగా విడదీసే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీ పదవులను నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే లేకుండానే టీడీపీ కైవసం చేసుకునేలా పనిచేశామన్నారు. కొత్తగా ఇంఛార్జ్‌ బాధ్యతలు ఎవరికి అప్పగించినా టీడీపీ విజయానికి కృషిచేస్తామని.. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామన్నారు నేతలు. ఈ


మరోవైపు రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పెందుర్తి వెంకటేష్‌  ఇటీవల రాజీనామా చేశారు. తన వల్ల పార్టీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నానని.. కొత్తవారిని ఇంఛార్జ్ పదవిలో నియమించుకోవాలని చెప్పారు. తాను పార్టీ లో కొనసాగుతానని.. అయినా సరే పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.


ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించారు. అధిష్ఠానంతో మాట్లాడతామని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరారు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. పెందుర్తి వెంకటేష్ రాజానగరం నియోజకవర్గం నుంచి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జక్కంపూడి రాజా చేతిలో ఓడిపోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa