ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మోదీని గద్దె దించి, దేశాన్ని కాపాడండి’ స్లోగన్ తో వెలసిన పోస్టర్లు,,,ఢిల్లీలో కలకలం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 02:21 PM

దేశ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తాజాగా  దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేలాది పోస్టర్లు అతికించడం కలకలం రేగింది. పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. ఈ ఘటనలో మొత్తం 44 కేసులు నమోదు చేసిన పోలీసులు.. నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఉన్నారు. మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. పలు ప్రాంతాల్లో దాదాపు 2 వేల పోస్టర్లను తొలగించారు. ఈ పోస్టర్లలో ‘మోదీని గద్దె దించి, దేశాన్ని కాపాడండి’ స్లోగన్ ఉన్నవే ఎక్కువ ఉన్నాయి.


ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు ప్రింటింగ్ ప్రెస్ పేరుతో పోస్టర్లు వేయాలనే చట్టం ప్రకారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు తాము 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, అందులో 44 మోదీ వ్యతిరేక పోస్టర్లకు సంబంధించినవేనని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయానికి డెలివరీ అవుతున్నట్లు చెబుతున్న 2,000 పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యాన్‌ను తనిఖీ చేసిన పోలీసులు ఈ పోస్టర్లను గుర్తించారు. పోస్టర్లను ఆప్ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని సూచించినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.


సోమవారం కూడా ఇటువంటి పోస్టర్లను డెలివరీ చేసినట్టు డ్రైవర్ చెప్పాడని పోలీసులు పేర్కొన్నాడు. దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన ఆప్.. పోస్టర్లలో ఏదైన అభ్యంతరమైనది ఉందా? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదుచేశారు? అని ట్వీట్ చేసింది. బీజేపీ నియంతృత్వం తారాస్థాయికి చేరిందని విమర్శించింది. ‘మోదీ హటావో.. దేస్ బచావో (మోదీని గద్దె దించి, దేశాన్ని కాపాడండి)’ స్లోగన్‌తో 50 వేల పోస్టర్లకు ఆర్దర్ ఇచ్చారని అరెస్టైన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. పోస్టర్లలో ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంతో యజమానులను అరెస్టు చేశారు.


తాజా పరిణామాలతో బీజేపీ, ఆప్‌ల మధ్య మాటలు యుద్ధం తారాస్థాయికి చేరింది. చట్ట వ్యతిరేకంగా ఆప్ పోస్టర్లు అతికిస్తోందని బీజేపీ ఆరోపించింది. ‘తాము నిరసనలు చేశామని చెప్పే ధైర్యం ఆప్‌కి లేదు.. పోస్టర్లు అంటిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది’ అని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా అన్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఆప్ సోమవారం నిరసన చేపట్టనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa