దేశంలో పలు రాష్ట్రాల్లోభూకంపం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్లోని పలు ప్రాంతాలను భూ ప్రకంపనలు వణికించాయి. అఫ్గానిస్థాన్లోని హిందూ కుష్ పర్వతాల్లో మంగళవారం (మార్చి 21) రాత్రి 10.17 గంటల సమయంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం కారణంగా అఫ్గానిస్థాన్తో పాటు భారత్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో ఫ్యాన్లు, డైనింగ్ టేబుళ్ల మీద ఉన్న వస్తువులు భూకంపం దాటికి కదిలాయి. ప్రజలు ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. అఫ్గానిస్థాన్లో నేడు గంటల వ్యవధిలో రెండోసారి భూప్రకంపనలు చోటు చేసుకోవడం గమనార్హం. ‘అల్లాహ్.. అందరినీ కాపాడు’ అనే పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. పాకిస్థాన్లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండిలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. చాలా మంది ఇళ్లలో నుంచి ఖాళీ స్థలాల్లోకి వచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇళ్లలో ఫ్యాన్లు, వస్తువులు ఊగుతున్న వీడియోలను మరికొంత మంది షేర్ చేశారు.
అఫ్గానిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ తరచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇది యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ ఉంది.
భూకంప తీవ్రత బలంగా ఉందని జమ్మూ కాశ్మీర్లోని కత్రాకు చెందిన రెస్టారెంట్ ఓనర్ శుభమ్ తెలిపారు. ‘ భూకంపం బలంగా ఉంది. ప్రకంపనలు ఎక్కువసేపు ఉన్నాయి. దీంతో పర్యాటకులందరూ భయంతో బయటకి పరుగెత్తారు. వైష్ణోదేవి ఆశీస్సులతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’ అని అతడు అన్నాడు. భూకంపం సంభవించిన వెంటనే జమ్మూ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడిందని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa