రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కరోనాకు ముందు, కరోనా సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ నియామకాలు కల్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి నేతలు సోమవారం మంగళగిరిలోని నిధి భవన్, ఐహెచ్సీ కార్పొరేట్లో గల వివిధ ప్రభుత్వ శాఖల హెచ్వోడీల్లోని ఉద్యోగులను కలిసి ఉద్యమానికి మద్దతు కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్నామని, ఉద్యోగులందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గుంటూరు జిల్లాలో సర్వీసులో ఉండగా మృతి చెందిన పలువురు ఉద్యోగుల కుటుంబాలను నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలను పరామర్శించేందుకు ‘పరామర్శ యాత్ర’ చేపట్టామన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించి వారి వేదనను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టి ఆటంకాలు సృష్టిస్తూ కారుణ్య నియామకాలు జరపడంలేదని ఆరోపించారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, పీడీటీ(ఆర్టీసీ), మెడికల్ తదితర విభాగాల ఉద్యోగుల కారుణ్య నియామకాలు దీర్ఘకాలికంగా పెండింగ్లో పెడుతున్నారన్నారు. రోస్టర్ పద్ధతిన పక్కన పెట్టిన వాళ్లకు అవసరమైతే సూపర్న్యూమరీ పోస్టులు సృష్టించి, ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa