ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి కాకాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 02:16 PM

 శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం,"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా పొట్టెంపాడు సచివాలయ పరిధిలో పోలంరాజుగుంట గ్రామంలో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప‌ర్య‌టించారు.  ప్ర‌తి ఇంటికి వెళ్లిన మంత్రి మూడున్న‌రేళ్ల వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌లో చేసిన సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.  ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.  ముత్తుకూరు మండలాన్ని యూనిట్ గా తీసుకొని నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ రూ.25,000/-లను అందించామ‌న్నారు.  మద్దతు ధర దొరక్క, రైతులు రోడ్డెక్కుతారని తెలుగుదేశం నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైతులను ఉసగొల్పి ప్రభుత్వంపై విమర్శలు చేయాలని తెలుగుదేశం నాయకులు స్క్రిప్ట్ రాసుకున్నారని మండిప‌డ్డారు. తెలుగుదేశం నాయకులు రాసుకున్న స్క్రిప్ట్ ను భగవంతుడు కొట్టేశాడ‌ని తెలిపారు. రికార్డు స్థాయిలో రైతుల ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలకడంతో రైతులందరూ సంతోషంగా ఉన్నార‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.  రైతులు పండించే రెండో పంటకు కూడా సమృద్ధిగా సాగునీరు అందిస్తామ‌న్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa