ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కి చేరుకున్నారు. ఇవాళ విశాఖలో జీ-20 దేశాల ప్రతినిధుల సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ బయల్దేరగా, విజయవాడ విమానాశ్రయంలో ఆయన ఎక్కిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దాంతో ప్రయాణాన్ని నిలిపివేసి, తాడేపల్లి తిరుగు పయనమయ్యారు. అయితే, టెక్నికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ రావడంతో సీఎం జగన్ ప్రత్యేక విమానంలో విశాఖ బయల్దేరారు. గత జనవరిలోనూ సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండగా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం విజయవాడకు తిరిగొచ్చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa