వివాహం అయిన కొన్ని నెలలకే భర్త, అత్తమామలు వరకట్న వేధింపులు భరించలేక విజయనగరం జిల్లా, మక్కువ మండల కేంద్రానికి చెందిన ఎస్.కనకమహలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్ళితే..... శ్రీనివాసరావు, కనకమహలక్ష్మికి గతేడాది వివాహం అయింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి తర్వాత తనతో భర్త సక్రమంగా వ్యవహరించకపోవడంతో మనస్తాపంతో బాధితురాలు పురుగులు మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు మక్కువ పీహెచ్సీకి తరలించగా, ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఔట్ పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa