ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యసనాలకు అలవాటుపడి భార్యని నరికి చంపిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 12:53 PM

కృష్ణా జిల్లా, ఎ.కొండూరు  మండలంలోని గోపాలపురం లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... స్థానిక  తండాకు చెందిన లక్ష్మీ(40)కి ఆదే తండాకు చెందిన కోటేశ్వరరావుతో 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. వ్యసనాలకు బానిసైన కోటేశ్వరరావు నిత్యం కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతుండేవాడు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరావు గురువారం రాత్రి సమయంలో పథకం ప్రకారం గొడ్డలితో భార్యను అతి కిరాతకంగా నరికి చంపినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ద్వాళా ఫిర్యాదు మేరుకు తిరువూరు సీఐ భీమారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎ్‌స్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa