పాఠశాల గేటుకు తాళం వేసి ఉండడంతో శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన పిల్లలు రోడ్డుపైనే నిలబడ్డారు. అద్దె చెల్లించలేదని పాఠశాల భవన యజమాని తాళాలు వేయడంతో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాలేజి రోడ్లో నిర్వహిస్తున్న పాఠశాల భవనానికి యజమానులు తాళం వేసి విద్యార్థులను అడ్డుకున్నారు. ఏడు నెలలుగా భవనానికి అద్దె చెల్లించకపోవడంతో తాళం వేయక తప్పలేదని భవన యజమానులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు అద్దె ఒప్పందం ఉందని ఇప్పటికే ఏడు నెలలు కావస్తున్న క్రమంలో ఈనెల ఆగితే ఖాళీ చేసి అద్దె డబ్బులు ఇవ్వరనే తాళం వేసినట్టు చెబుతున్నారు. ఈక్రమంలో విద్యార్థులను సిబ్బంది మరో చోటుకు తరలించా రు. పోలీస్ సిబ్బంది సంఘటన స్ధలానికి వచ్చి వివాదం సరికాదని, ఇబ్బంది ఉంటే చట్టప్రకారం ఫిర్యాదు చేయాలని సూచించడంతో భవన యజమా నులు పోలీస్స్టేషన్లో తెలియచేయడానికి తరలివెళ్లారు. ప్రైవేటు పాఠశాల డీన్ కె.సత్యనారాయణను వివరణ అడుగగా విద్యార్థులను, సిబ్బందిని అడ్డుకుని ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa