పాదయాత్రలో తెలుసుకున్న మహిళల కష్టనష్టాల గురించి ఆలోచన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా పథంకం తీసుకువచ్చారని, రాష్ట్రంలో మహిళలను అక్క చెల్లెళ్ళు అంటూ సభోదించే ముఖ్యమంత్రి వేరే ఎవరు ఉండరు, లేరని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన 3వ విడత వైఎస్సార్ ఆసరా విడుదల కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ , డి ఆర్ డి ఎ పిడి సాంబశివారెడ్డి లతో కలిసి మంత్రి కాకాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వెలుగు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పొదుపు మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. వైయస్సార్ ఆసరా ద్వారా పొదుపు మహిళలకు ఇచ్చిన గొర్రెలు, పలు రకాల యంత్రాల స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం, డిఆర్డిఏ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమయిన జీవనోపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. భారత దేశ చరిత్రలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పారు. వైఎస్సార్ ఆసరా పధకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పంతొమ్మిది వేల నూట డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని. ఒక్క ముత్తుకూరు మండలానికి 91. 52కోట్లు ఖర్చు చేశారని కాకాణి చెప్పారు. అనంతరం వైఎస్సార్ ఆశరా జంబో చెక్కును లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్యం గౌడ్, ముత్తుకూరు సర్పంచ్ భూదురు లక్ష్మి, గ్రామ సర్పంచ్ లు కాకి మస్తానమ్మ, అన్నాబత్తిన కృష్ణవేణి, ఎంపిటిసి సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa