తాజాగా మరో కొత్త వైరస్ అలజడి రేపుతోంది. వైద్య నిపుణులు హెచ్చరించినట్లే కొత్త రకం వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆఫ్రికాలోని బురుండిలో కొత్త రకం వైరస్ ప్రబలుతోంది. కరోనా కంటే డెడ్లీ వైరస్ అని అక్కడి వైద్య సిబ్బంది చెబుతున్నారు. ముక్కు నుంచి రక్తం కారుతూ మరణిస్తున్నారు. వైరస్ సోకిన 24 గంటల్లోనే ప్రాణాలను హరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. బురుండిలోని బజిరో రీజియన్లోని ఓ చిన్న పట్టణంలో ఈ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్తో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకి వచ్చేందుకు వణికిపోతున్నారు. వైరస్ బారిన పడిన మూడో వ్యక్తిని బంధవులు తరలిస్తుండగా.. రెండు పట్టణాలకు చెందిన ప్రజలు రహదారులను మూసేసి అడ్డుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు.
ఈ వైరస్ సోకిన వారిలో వైరల్ హెమరేజిక్ జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. అంటే.. రోగుల ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి కొన్ని గంటల్లోనే మరణిస్తున్నారు. సన్నని రక్తనాళాల గోడలను ఈ వైరస్ దెబ్బతీస్తోంది. వాటిని లీక్ చేస్తోంది. మార్బర్గ్, ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
కొత్త వైరస్ లక్షణాలు:
✦ తీవ్రమైన జ్వరం
✦ ముక్కు నుంచి రక్తస్రావం
✦ పొత్తి కడుపుతో భరించలేని నొప్పి
✦ తీవ్రమైన తలనొప్పి
✦ వాంతులు
✦ నీరసం
✦ స్పృహ కోల్పోవడం
ఈ వైరస్ బారినపడిన రోగులు మృతి చెందిన తర్వాత కూడా రక్తస్రావం కొనసాగుతోందని ఓ నర్సు తెలిపారు. ‘ఈ వైరస్ చాలా త్వరగా ప్రాణాలు తీస్తోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఎపిడిమిక్గా ప్రకటిస్తే.. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.
ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన ముగ్గురూ గిటోబో కమ్యూనిటీకి చెందిన వారు. ఈ తెగకు చెందిన వారందరూ మిగ్వా కొండ ప్రాంతానికి సమీపంలో నివసిస్తారు. ప్రస్తుతం ఈ తెగలో కొత్త వైరస్ లక్షణాలతో ఆస్పత్తుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఈ వైరస్ను కట్టడి చేసేందుకు పట్టణంలోని ప్రజలందరినీ క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. బాధితుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.
బురుండితో సరిహద్దు పంచుకుంటున్న టాంజానియా దేశం కొన్ని రోజుల కిందట మార్గ్బర్గ్ ఔట్బ్రేక్ను ప్రకటించింది. టాంజానియాలో తొలిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. 8 మందిలో లక్షణాలు కనిపించగా.. వీరిలో ఐదుగురు మరణించారు. ఇది ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఆఫ్రికాలో కొన్నేళ్ల కిందట ఎబోలా వైరస్ మారణహోమం సృష్టించింది. వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ రెండు వైరస్ల లక్షణాలతోనే కొత్త వైరస్ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa