పలాస మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ కుమార్ పై మంత్రి అప్పలరాజు అనుచర వైసీపీ నాయకులు దాడి చెయ్యడం పలాస లో వైసీపీ నేతల బరితెగింపు రోజురోజుకూ పెచ్చు మీరిపోతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ ఆగ్రహాం వ్యక్తం చేసారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులే లక్ష్యంగా వైసీపీ తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తేదేపా నాయకుడిపై దాడికి తెగబడటం హేయమైన చర్య గా కోండ్రు దుయ్యబట్టారు. పలాస నియోజక వర్గంలో మంత్రి అప్పలరాజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పులివెందుల రాజకీయాలను అవలంబిస్తున్నారన్నారు.
మండల అధ్యక్షుడి పై మంత్రి ఆరోపించిన ఆరోపణలకు ప్రతి సవాల్ విసురుతూ మంత్రి ని రాజీనామా చేయమంటే, ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు అందరూ చూస్తుండగానే దాడికి దిగటం సిగ్గుచేటన్నారు. పలాస జాతీయ రహదారి రామ కృష్ణాపురానికి సమీపంలో లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి తమ వాహనంతో ఢీ కొట్టి అతనిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాడ్పడటం ఏంటని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa