ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని వరిధనంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.... ఏపీ అంటే కేరాఫ్ గంజాయిగా మారిందని పేర్కొన్నారు. జగన్ అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లో 21,775 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని పార్లమెంటు సాక్షిగా చెప్పారంటే నిరుద్యోగ సమస్య ఎంతగా ఉందో తేటతెల్లమవుతోందని అన్నారు. భావితరాల ప్రయోజనాల కోసం చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కోడి విజయభాస్కర్, రాయి ప్రసాద్, పోతుల సూరిబాబు, ద్రాక్షారపు జ్యోతి, బొక్కా సూరిబాబు, వర్థనపు విల్సన్బాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa