ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ హయాంలోనే ఐటీ ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపన జరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 03, 2023, 01:36 PM

జగన యువతను మోసం చేసి నట్టేట ముంచాడని కడప జిల్లా, మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ ద్వజమెత్తారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన లేక, స్వయం ఉపాధికి ప్రభుత్వ సహకారం లేక నిరుద్యోగులు వలస వెళుతున్నారన్నారు. టీడీపీ హయాంలో 5.13లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని నాటి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే ఐటీ ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపన జరిగిందన్నారు. రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ సంస్థ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే నవాజ్‌బాషా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ.500 పంచలేదా అని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థి తరపున తాము డబ్బులు పంచలేదని పవిత్ర రంజాన మాసంలో ఏ మసీదు వద్దకు అయినా వచ్చి తాము ప్రమాణం చేస్తామని, ఇదే ప్రమాణం నవాజ్‌బాషా చేయగలరా అని సవాల్‌ విసిరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa