ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లోకి చొరబడి 80 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 03, 2023, 01:43 PM

నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామంలోని  చోరీ జరిగింది. 80 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు దొంగలు అపహరించారు. వివరాల్లోకి వెళ్ళితే.... నాపరాతి పరిశ్రమ యజమాని మల్లు  వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి తిరుపతి వెళ్లారు. అయితే ఆదివారం ఉదయం తలుపులు తెరిచి ఉండడంతో కార్మికులు ఈ విషయాన్ని యజమానికి చెప్పారు. ఇంటికి చేరుకున్న వెంటనే వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబసభ్యులు పరిశీలించగా, బీరువాను ధ్వంసం చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఇంటిని పరిసరాలను పరిశీలించారు. కొంతమంది అనుమానితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa