టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర యధావిధిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. సోమవారం ఉదయం ముష్టూరు క్యాంప్ సైట్ నుంచి 59వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. సంజీవ్పురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగలతో భేటీ అయ్యారు. ఎర్రయ్యపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతి నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర లో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. లోకేష్ తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తాము ఎదుర్కుంటున్న సమస్యలను యువనేత ముందు ఏకరవుపెడుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వారి సమస్యలను వింటున్న లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. 59వ రోజు పాదయాత్రలో నారా లోకేష్తో కలిసి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa