ప్రైవేట్ చిట్టి లు నడపడం చట్ట విరుద్ధమని, ప్రజలు ఎవరూ కూడా అలాంటి వారి మాటలు నమ్మకూడదని రాజాం సీఐ రవికుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం రాజాం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా ఇప్పటికే చీటీలు కట్టి మోసపోయిన వారు పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేసిన యెడల వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దయచేసి ప్రజలు ఎవరూ కూడాను అనాథరైజ్ చిట్టీలు కట్టి మోసపోకూడదని రాజాం పోలీసు వారి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. అలాగే వేసవి సెలవుల సందర్భంగా ఎవరైనా క్యాంపులకు వెళ్లేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకొని మీ ఇంటికి తాళాలు వేసి వెళ్లిన యెడల రాజాం పోలీస్ స్టేషన్ కు తెలియజేయవలెనని రాజాం సిఐ కే. రవికుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa