ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రాతపరిక్షకి హాజరుకానున్న జూనియర్‌ అసిస్టెంట్‌ ఆశావహులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 12:23 PM

ఏపీ రెవెన్యూశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాత పరీక్షలు జరుగుతాయని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయించామని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ తెలిపారు. కావలిలోని పీబీఆర్‌ విశ్వోదయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సు, కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం మూడు కేంద్రాల్లో కలిపి 360 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు, ఏదైనా ఫొటో ఆధారిత గుర్తింపు కార్డు తప్పని సరిగా తెచ్చుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa