‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లి ప్యాలె్సలో నిర్వహించిన వర్క్ షాప్ కు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హాజరు కాకపోవడం కొంత విస్మయం కలిగిస్తోంది. క్యాంపు కార్యాలయం తన నియోజకవర్గ పరిధిలో.. కూతవేటు దూరంలోనే ఉన్నా కొంతకాలంగా ఆయన అటు వైపే వెళ్లడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ సజ్జల దర్శనానికి తహతహలాడుతుంటే ఆళ్ల మాత్రం ఆయన ఫోన్ చేసినా స్పందించడం లేదని సమాచారం. జగన్కు మద్దతుగా ఆళ్ల అనేక మందిపై కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు కూడా. అంతటి వీరాభిమాని కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాగని బయటపడకుండా మౌనముద్ర దాల్చారు. సీఎం జగన్కు, ఆళ్లకు మధ్య బాగా గ్యాప్ ఏర్పడిందనడానికి ఇటీవల జరిగిన ఓ సంఘటనే నిదర్శనమని అంటున్నారు. గత నెలలో ఆళ్ల కుమారుడి వివాహం హైదరాబాద్లో జరిగింది. ఈ వివాహానికి రమ్మని సీఎం జగన్కు ఆహ్వానపత్రం అందజేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దీనితో అనుమానాలు రుజువైనాయి అని అనుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa