తెలుగుదేశం ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు నిర్వహణకు జిల్లా పార్టీ నాయకులు ఐదు కమిటీలు ఏర్పాటుచేశారు. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈనెల ఐదో తేదీన నగరంలోని పోతినమల్లయ్యపాలెంలో గల ‘వి కన్వెన్షన్’ సెంటర్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న సదస్సులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదు వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున. అందుకు తగినవిధంగా ఏర్పాట్లుచేయాలని నేతలు నిర్ణయించారు. ఇందుకోసం ఆహ్వానం, అలంకరణ, ఫుడ్, ఆర్గనైజేషన్, వలంటీర్ల కమిటీలు ఏర్పాటుచేశారు.
ఎయిర్పోర్టు నుంచి పీఎంపాలెంలో వి. కన్వెన్షన్ సెంటర్ వరకు జాతీయ రహదారి పొడవునా పార్టీ జెండాల అలంకరణ బాధ్యతను కార్పొరేటర్ల సాయంతో డెకరేషన్ కమిటీ చేపట్టనున్నది. సదస్సుకు వచ్చే నాయకులు, ఇన్చార్జులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులకు భోజనం అందించే బాధ్యతను ఆహార కమిటీ తీసుకోనున్నది. ఈ సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
ఈ సమావేశంలో పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న, విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ ఇన్చార్జి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగదీశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జులు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్, బత్తుల తాతయ్యబాబు, కోళ్ల లలితకుమారితో పాటు మూర్తియాదవ్, బొండా జగన్, పల్లా శ్రీనివాసరావు, ఇంకా పలువురు కార్పొరేటర్లు, నాయకులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa