ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంటిమిట్ట ఆలయానికి రేపు వెళ్లనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 01:01 PM

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ‌ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రై స్వామివారిని దర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.35 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. 3.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు. 3.30 నుంచి 3.50 గంటల వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. 4.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 6.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa