పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత విషయంలో పాశ్చాత్య దేశాలు స్పందించడం పట్ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ అనర్హత విషయంలో అమెరికా, జర్మనీ స్పందించిన విషయం తెలిసిందే. దక్షిణ బెంగళూరు ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జైశంకర్.. పాశ్చాత్య దేశాల తీరు, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పాశ్చాత్య దేశాలకు ఉన్న ఓ దురలవాటని ఆయన ఆరోపించారు. ‘‘నేను మీకు నిజమైన సమాధానాలు చెప్పదల్చుకున్నాను.. ఇక్కడ రెండు కారణాలున్నాయి.. మొదటిది.. ఇతరుల వ్యవహారాల గురించి మాట్లాడటం పాశ్చాత్య దేశాలకు ఉన్న దురలవాటు. అది దేవుడు ఇచ్చిన ప్రత్యేక అర్హతగా వారు భావిస్తారు.. ఈ విషయాన్ని అనుభవం ద్వారానే వాళ్లు తెలుసుకోవాలి. ఇదే విధంగా ఇతరులు విషయాల గురించి మాట్లాడుతుంటే.. వారి గురించి కూడా ఇతరులు మాట్లాడతారు... ప్రస్తుతం అదే జరుగుతోంది.. రెండోది.. మన వాదనల్లోకి ఇరులను లాగడం.. మన సమస్యలపై స్పందించమని ఇతరులను కోరితే.. వారు తప్పకుండా మాట్లాడుతారు.. భారత్లో సమస్యలున్నాయి.. మీరు ఎందుకు మాట్లాడటంలేదు. ఏమైనా చేయొచ్చు కదా.. అని ఇతరులకు అవకాశం ఇస్తే వారు తప్పకుండా తమ స్పందిస్తారు.. నిజానికి ఇక్కడ సమస్య వాళ్లు మాత్రమే కాదు, మనం కూడా. ఈ రెండింటిని సరిచేయాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa