రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏప్రిల్ 14 నుంచి ప్రజా సమస్యలపై చీరాల నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామని సిపిఐ నేతలు తెలిపారు. బుధవారం సాయంత్రం చీరాల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సీపీఐ అత్యవసర సమావేశం జరిగింది. ప్రజల కోసం నిరంతరం తమ పార్టీ పోరాటం చేస్తుందని సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ చెప్పారు. అందులో భాగంగానే పాదయాత్ర చేపడుతున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమకు సహకరించాలని కోరారు. సిపిఐ జిల్లా నేతజెల్లీ భాగ్య శ్రీధర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, సీపీఐ నియోజకవర్గ నేతలు చిరుమల ప్రకాష్, మేడ వెంకట్రావు, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు అచ్యుతుని బాబురావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa