ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన నేతలు క్లియర్ గా ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 03:56 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఇతర పెద్దలను కలిశారని.. దీన్ని వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ పొత్తులపై స్పష్టంగా చెప్పారన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా బీజేపీ, జనసేన మాత్రమే పొత్తు అని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పిస్తామని, అందులో భాగంగా సమావేశాలు జరిపామని, ప్రతిపక్షాల ఓటు చిలనివ్వనని పవన్ తన మనసులో మాట స్పష్టంగా చెప్పారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa