నెల్లూరులో జరిగిన ఓ ఘటన మాతృమూర్తులందరికి మచ్చ తెచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్ళితే... నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘంలో ఉంటున్న కలుపూటి మణికంఠ, అనూష దంపతులకు కృతిక, లక్ష్మీ హారిక(18నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మణికంఠ రాపూరులో హోటల్ నిర్వహిస్తూ అక్కడే ఉంటుండగా, అనూష నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతూ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చదువు పూర్తి చేసుకొని, భర్తకు విడాకులిచ్చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ విలాసవంతమైన జీవితం గడపాలని అనుష భావిస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తెకు నాలుగేళ్లు కావడంతో తనను భర్తకు అప్పగించినా, 18 నెలల వయసున్న చిన్న కుమార్తెను ఎలా అడ్డుతొలగించుకోవాలనే ఆలోచనలో పడింది. ఈ నెల 3న అర్ధరాత్రి ఊయలలో నిద్రపోతున్న చిన్న కుమార్తెను ఇంటి వెనుక ఉన్న సర్వేపల్లి కాలువలో పడేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఊయలలో రెండు టెడ్డీబేర్ బొమ్మలను పెట్టి పాపను కిడ్నాప్ చేశారంటూ హైడ్రామా నడిపింది. భర్తతో కలిసి 4వ తేదీన బాలాజీనగర్ పోలీసులకు తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. అనూష ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో, ఎస్పీ ఆదేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అనూషను, మరి కొందరిని విచారించడంతో కుమార్తెను తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు కాలువలో గాలించి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. అనూషను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa